Tuesday, April 30, 2024

నలుగురు ఎర్ర స్మగ్లర్లు అరెస్ట్..

తిరుపతి (రాయలసీమ ప్రభ వెబ్ ప్రతినిధి) : అన్నమయ్య జిల్లా పరిధిలో బాలపల్లి రేంజ్ లో టాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవారం 16 ఎర్రచందనం దుంగలతో పాటు నలుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి నుంచి ఇన్నోవా వాహనం, ఒక ద్విచక్ర వాహనం 80,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ ఆర్ఐ కృపానంద బృందం అన్నమయ్య జిల్లా రాజంపేట సమీపంలో బాలపల్లి రేంజ్ తుని కొండ ఫారెస్ట్ పరిధిలో కూంబింగ్ చేస్తుండగా కొంతమంది ఇన్నోవా కారులో ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. వారిని చుట్టుముట్టి దుంగలతో పాటు ఇన్నోవా కారు హీరో మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకుని వారి నుంచి రూ.80 వేల నగదును రికవరీ చేశారు. ఈ సందర్బంగా అరెస్టు అయిన వారిలో రైల్వే కోడూరు మండలం నాగోల వెంకటరెడ్డి (31), బొడ్డు శ్రీనివాసుల రెడ్డి(37), మిరియాల నాగేంద్రబాబు (33), ఓబులవారిపల్లె మండలం అరికల మహేంద్ర (26) ఉన్నారు. ఈ మేరకు తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన సీఐ చంద్రశేఖర్ దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement