Thursday, April 25, 2024

రేపు కడప జిల్లాలోజగన్ పర్యటన – జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు భూమిపూజ

కడప – ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు కడప జిల్లాలోని జమ్ములమడుగు, పులివెందులలో పర్యటించనున్నారు. సీఎం పర్యటన షెడ్యూల్‌ ప్రకారం.. ఉదయం 9 గంటల ప్రాంతంలో తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పదకొండు గంటల ప్రాంతంలో జమ్ములమడుగు మండలం సున్నపురాళ్ళపల్లె చేరుకుంటారు. ఆపై జేఎస్‌డబ్యు స్టీల్‌ప్లాంటుకు సంబంధించి భూమిపూజ, శిలాఫలకాలు ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే స్టీల్‌ ప్లాంటు మౌలిక సదుపాయాలపై సమావేశం నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నాం ఒంటిగంట ప్రాంతంలో పులివెందుల చేరుకుంటారు. అక్కడి ఎస్‌సీఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో మూలి బలరామిరెడ్డి కుమారుని వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు

Advertisement

తాజా వార్తలు

Advertisement