Saturday, May 18, 2024

మద్యం మత్తులో ఘ‌ర్ష‌ణ : విద్యార్థిని పొడిచిన ఆకతాయిలు

తిరుపతి సిటీ : తిరుపతి నగరంలో మార్కెట్ సమీపంలో ఓ టీ స్టాల్ వద్ద విద్యార్థిని మద్యం మత్తులో సోడా బాటిల్ తో పొడిచిన సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది.. వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన మధు బాబు ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. టీ స్టాల్ వద్ద అప్పటికే మద్యం తాగుతున్న కొంతమంది మధుబాబు తో మాట మాట పెరిగి బాటిల్స్ తో దాడి చేయడం, విద్యార్థిని ఆ బాటిల్స్ తో పొడవడంతో 13 కుట్లు పడ్డాయి. చికిత్స నిమిత్తం రుయా హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి తాతయ్యగుంటకు చెందిన శివ, ఇనాయ తుల్లాల‌ను అరెస్టు చేసినట్లు ఈస్ట్ ఎస్సై ప్రకాష్ తెలియజేశారు. మద్యం మత్తులో ఇలాంటి సంఘటనలు తిరుపతి నగరంలో అనేకంగా చోటుచేసుకుంటున్నాయి. పోలీసుల వరకు వస్తే పట్టీపట్టనట్లు కూడా ఉన్నట్లు విమర్శలు కూడా వస్తున్నాయి. ఇకనైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి సంఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆకతాయిలకు ముకుతాడు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement