Wednesday, May 8, 2024

చిత్తూరు జిల్లాలో భూ ప్రకంపనలు.. భయంతో జనాలు వీధుల్లోకి ..

చిత్తూరు జిల్లాలో భూ ప్ర‌కంప‌న‌లు సంభ‌వించాయి. పలు ప్రాంతాల్లో గత రాత్రి భూమి పది సెకన్ల పాటు కంపించడంతో ప్ర‌జ‌లు భయభ్రాంతులకు గుర‌య్యారు. దీంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ముఖ్యంగా పలమనేరు, గంట ఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో ప్రకంపనలు కనిపించాయి. ప‌లు ప్రాంతాల్లో దాదాపు 15 నిమిషాల వ్యవధిలో భూమి మూడుసార్లు కంపించిన‌ట్లు అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement