Tuesday, April 30, 2024

కొమురంభీం జిల్లాలో విషాదం.. గంట‌ల వ్య‌వ‌ధిలో మామ‌, కోడ‌లు మృతి..

తెలంగాణ రాష్ట్రంలోని కొమురంభీం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లాలోని కౌటాల మండ‌లం త‌లోడిలో కుటుంబ నియంత్ర‌ణ ఆప‌రేష‌న్ విక‌టించి కోడ‌లు మృతిచెందింది. కోడ‌లు మ‌ర‌ణ‌వార్త విన్న మామ‌కు గుండెపోటు రావ‌డంతో ఆయ‌న మృతిచెందాడు. గంట‌ల వ్య‌వ‌ధిలోనే మామ‌, కోడ‌లు చ‌నిపోయారు. దీంతో ఆ గ్రామంలో విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement