Saturday, May 4, 2024

సీఎం జగన్‌ పాలనలో నేరాల్లో రాష్ట్రం ప్రథమస్థానం : నారా లోకేష్

సీఎం జగన్ మోహన్‎రెడ్డి విధ్వంస పాలనపై దుష్ఫలితాలు వచ్చేశాయంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… నేరాలు – ఘోరాల గణనీయ వృద్ధిలో జగన్ ఏ1గా నిరూపించుకున్నారని ఆరోపించారు. మూడేళ్లలో ఆర్థిక నేరాల కేసులు 9,273కు పెంచడం ప్రతిభకు నిదర్శనమన్నారు. దేశద్రోహం కేసుల నమోదులో ప్రథమ స్థానంలో నిలిచారని, సోషల్ మీడియా లో పోస్టులు పెడితే దేశద్రోహం కేసులు బనాయించారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో ప్రథమస్థానం ఉంటే.. జగన్ పాలనలో నేరాల్లో ప్రథమస్థానం ఉందని నారా లోకేష్ యెద్దేవ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement