Monday, April 29, 2024

తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి 24 గంట‌ల స‌మ‌యం..

క‌లియుగ ప్ర‌త్య‌క్ష దైవ‌మైన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి వారి ద‌ర్శ‌నానికి వివిధ ప్రాంతాల నుంచి భ‌క్తులు భారీగా త‌ర‌లివ‌చ్చారు. వరుసగా సెలవులు రావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటేత్తారు. భ‌క్తుల‌కు ఇబ్బందులు క‌ల‌గ‌కుండా టీటీడీ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పట్టనుంది. శనివారం శ్రీవారిని 85,450 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.21 కోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement