Thursday, May 16, 2024

చంద్రబాబు పుట్టిన‌రోజు.. తిరుమ‌ల‌లో 774 కొబ్బరి కాయలు కొట్టి మొక్కులు..

తిరుపతి సిటీ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా గురువారం తిరుమల శ్రీవారి ఆలయం వద్ద ఉన్న అఖిలాండము దగ్గర 774 కొబ్బరి కాయలు కొట్టి ఏడు కేజీల 40 గ్రాముల కర్పూరాన్ని వెలిగించి మొక్కులు తీర్చుకోవడం జరిగిందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు రాష్ట్ర ప్రజలకు మరిన్ని సేవలందించాల‌న్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రానికి పరిపాలన అందించే అవకాశం 2024లో కల్పించాలని కోరుతూ శ్రీవారి ఆశీస్సులు మెండుగా ఉండాల‌ని మొక్కలు తీర్చుకోవడంతో జరిగింద‌న్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్రం అభివృద్ధి చెందడంతో పాటు సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని తెలిపారు. 2024లో తెలుగు దేశం పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, ప్రజలు రానున్న ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు భాస్కర్ వర్మ, రూపేష్ వర్మ, మధు, బొంగి బాలాజీ, వెంకటస్వామి, సుబ్బు, గౌతం పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement