Monday, May 6, 2024

ఈ మామిడి పండు జస్ట్.. రూ.2.70లక్షలు మాత్రమే

ఈ మామిడి తినాలంటే కిలోకు రూ.2.70లక్షలు చెల్లించాల్సిందే. ఇది అబద్దం కాదు.. నిజం.. మామూలుగా మామిడి పండు తినాలంటే ఎండాకాలం కోసం ఎదురుచూస్తాం. ఎందుకంటే మామిడి పండ్లు ఎండాకాలంలోనే వస్తాయి కాబట్టి.. అయితే ఎండాకాలంలో దొరికే రకరకాల వెరైటీ పండ్లలో మామిడి పండ్లకు యమ డిమాండ్‌ ఉంటుంది. అయితే మియాజాకి రకానికి చెందిన మామిడి పండ్లను తినాలంటే కిలోకు రూ.2.70 లక్షలు ఖర్చు చేయాలి. ఊదా రంగులో ఉండే ఈ పండ్లను ఎక్కువగా జపాన్‌లో పండిస్తారు. అయితే ఈ మామిడి పండును సామాన్య ప్రజలు తినలేరు. అత్యంత ఖరీదైన పండ్లు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లుగా పేరుగాంచిన ఈ మియాజాకి పండ్ల తోటను కాపాడటానికి కుక్కలను కాపలా ఉంచుతుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement