Sunday, May 5, 2024

Breaking: గుడిపల్లిలో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనలో ఉన్నారు. అయితే చంద్రబాబు పర్యటనకు అన్నీ అడ్డంకులే ఉంటున్నాయి. గుడిపల్లిలో రోడ్డుపై చంద్రబాబు బైఠాయించారు. ప్రచార రథాన్ని పోలీసులు అడ్డుకున్న పోలీసుల తీరుకు నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. అలాగే టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. మైక్ పర్మీషన్ ఇవ్వాలని చంద్రబాబు ఆందోళన చేస్తున్నారు.

డీజీపీకి లేఖ రాసినా స్పందించకపోవడంపై చంద్రబాబు నిరసన తెలుపుతున్నారు. ఓ సైకో చెబితే అలా పనిచేస్తారా అని ప్రశ్నించారు. ప్రజాహితం కోసమే తన పోరాటమన్నారు. పోలీసులు రాకుంటే ఏం చేయాలో అది చేస్తానన్నారు. చంద్రబాబు రోడ్డుపై బైఠాయించడంతో కుప్పంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement