Thursday, April 25, 2024

టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన చక్రవర్తి

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ ఎస్పీగా కె.చక్రవర్తి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఏలూరు ఏఎస్పీగా ఉండగా పదోన్నతి మీద టాస్క్ ఫోర్స్ ఎస్పీగా బదిలీపై వచ్చారు. ఛార్జ్ తీసుకుని మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా ఎర్రచందనం పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. శేషాచలం అడవులు నుంచి అక్రమ రవాణా జరగకుండా చర్యలు తీసుకుంటానని అన్నారు. స్మగ్లర్లను ఉక్కుపాదంతో అణచి వేస్తామని అన్నారు. దీనికి ప్రత్యేక వ్యూహాలను, ఇతర అధికారులతో కలసి రూపొందిస్తామని తెలిపారు. తరువాత టాస్క్ ఫోర్స్ ఆర్ఐ, సీఐ,ఎస్ఐ తదితర అధికారులతో సమావేశమయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement