Saturday, April 27, 2024

చైత‌న్య క‌ళాశాల హాస్ట‌ల్లో విద్యార్ధిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణం..

తిరుపతి – చైతన్య కాలేజీ ఇంటర్ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేగింది.. ముత్యాల రెడ్డి పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తుమ్మలగుంట చైత‌న్య క‌ళాశాల‌ క్యాంపస్ ఉంటూ ఎం.పీ.సీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని చ‌రిత్ర‌ క్యాంపస్ హాస్టల్ నందు ఉరి వేసుకుంది. రూమ్మేట్స్ గుర్తించి వెంట‌నే క‌ళాశాల సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు..దీనిపై అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.. కుటుంబ సభ్యుల వివరాలు మేరకు ఇలా ఉన్నాయి.. పీలేరు మండలం ఎర్రగుంట పల్లె గ్రామం చెందిన లే పి చరిత్ర హాస్టల్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కాలేజీ యాజమాన్యం విద్యార్థిని రుయా హాస్పిటల్ కి తరలించారు. అప్పటికేమృతి చెందినట్లు వైద్యాధికారులు ధృవీకరించారు. విద్యార్థి శరీరంపై గాయాలు ఉండడంతో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు . దీనిపై చరిత్ర బంధువులు ఎం.ఆర్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ నర్సింహులు కేసు నమోదు చేసి మృతికి కారణాలను తెలుసుకొనేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement