Saturday, May 4, 2024

సీఎం ప‌ర్య‌ట‌న ఏర్పాట్లు ప‌రిశీల‌న‌..

తిరుపతి సిటీ : తిరుపతి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 23న రానున్న సందర్భంగా ఏర్పాట్ల‌ను జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ప‌రిశీలించారు. మంగళవారం రేణిగుంట హెలిప్యాడ్ నుండి వకుళ‌మాత ఆలయం, విమానాశ్రయం, అపాచీ కంపెనీల వ‌ద్ద గ‌ట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేయ‌నున్నారు. ముందుగా ఆర్డిఓ కార్యాలయం నందు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రాక సందర్భంగా బందోబస్తు ఇతర ఏర్పాట్లు నిమిత్తం భద్రతా పరమైన అంశాలను చర్చించడం జరిగింది. సీఎం పర్యటన రోజు పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా లాండ్ అదనపు ఎస్పీ కులశేఖర్, ఇంటలిజెంట్ అడిషనల్ ఎస్పి స్వామి. ఆర్డిఓ కనక నర్సారెడ్డి, వెస్ట్ డీఎస్పి నరసప్ప, ట్రాఫిక్ డీఎస్పి కాటంరాజు, ఏఆర్ డీఎస్పీ నందకిషోర్, ఎంఆర్ పల్లి సీఐ సురేంద్ర నాథ్ రెడ్డి, ఆర్.ఐ.లు రెడ్డప్ప రెడ్డి, చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement