Thursday, April 25, 2024

రూ.41 లక్షలతో ఆటో నగర్ రోడ్లు, కాలువలు ఆధునీకరణ : ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : స్థానిక ఆటోనగర్ లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.41 లక్షలతో రోడ్లు కాలువలు ఆధునీకరణ చేపడుతున్నట్లు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. మంగళవారం గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ఆటో నగర్ లో విస్తృతంగా ఇంటింటికి పర్యటించి సంక్షేమ పథకాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్లు కాలువలు ఆధునీకరణ చేపట్టడం జరుగుతుందని వివరించారు. దోమల నివారణ కోసం ఆటోనగర్ లో ఫాగింగ్ చేయడం జరుగుతుందని వివరించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్‌ భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ, కార్పొరేటర్ లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement