Tuesday, April 30, 2024

అర్హతే ప్రామాణికంగా పథకాలు వర్తింపు : ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి

తిరుపతి సిటీ : అర్హతే ప్రామాణికంగా సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వర్తింప చేస్తుందని ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని వెంకటరెడ్డి కార్పొరేటర్ ఎస్.కె బాబు.. ఆధ్వర్యంలోనిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకోవడంతో పాటు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని తెలియజేస్తూ గత మూడు సంవత్సరాలుగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గురించిబుక్ లెట్ ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సుస్థిరంగా, సుభిక్షంగా ఉంచే శక్తి ఆయనకు మాత్రమే ఉందన్నారు. జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని అఖిలాంధ్ర ప్రజానీకం కోరుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ శిరీష, డిప్యూటీ మేయర్ ముద్రనారాయణ, కార్పొరేటర్ రామస్వామి వెంకటేశ్వర్లు, కొ టూరి ఆంజనేయులు, గంగమ్మ గుడి చైర్మన్ కట్ట గోపి యాదవ్, ఎస్సీ, ఎస్టీ సెల్ కమిటీ మెంబర్ రావూరి ప్రసాద్, వైఎస్ఆర్సిపి నాయకులు ప్రసాద్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement