Monday, April 29, 2024

ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ.. ప్ర‌యాణికుల‌కు స్వ‌ల్ప గాయాలు..

తిరుపతి సిటీ : తిరుపతి నుండి అడపారెడ్డిపల్లి వెళుతున్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘ‌ట‌న 150 బైపాస్ రోడ్డు జంక్షన్ వద్ద చోటుచేసుకుంది. వేదాంతపురం జంక్షన్ వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న ఆర్టీసీ బ‌స్సును తిరుచానూరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొనడంతో బస్సు పల్టీ కొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఇదిలా ఉండగా సర్కిల్ వద్ద అండర్ బ్రిడ్జి నిర్మించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. రెండు మూడు రోజులకు ఒక‌సారి ప్రమాదాలు జరుగుతున్నాయని, అనేక మంది ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా స్థానిక ప్రజా ప్రతినిధులు బ్రిడ్జి నిర్మాణానికి చొర‌వ‌ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement