Friday, March 29, 2024

ఉరివేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

తిరుపతి సిటీ, ఏప్రిల్ 3 (ప్రభ న్యూస్): స్థానిక ఎంఆర్ పల్లిలోని శ్రీకృష్ణ నగర్ లో కొంతమంది విద్యార్థులు కలిసి ఒక ఇల్లును అద్దెకి తీసుకుని ఉంటున్నారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చదువుతున్న సి, ఈ ,సి, నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని చిత్తమూరు మండలం పాకాల అనూష 21 సంవత్సరం మొదటి ఫ్లోర్ లో రూమ్ నందు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వారి బావ కుమారుడికి, తోటి విద్యార్థులకు అనూష ఫోన్ చేసినా తీయడం లేదని సమాచారంతో రూమ్ లోకి వెళ్లి చూడగానే అనూష ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనను పరిశీలించి ఎంఆర్ పల్లి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి ఎంఆర్ పల్లి పోలీసులు వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement