Thursday, May 2, 2024

భార్య పై అనుమానంతో కత్తితో భర్త దాడి

పుంగనూరు, కట్టుకున్న భార్య ను అనుమానం తో భర్త కత్తితో నరికిన ఘటన సోమవారం రాత్రి పుంగనూరు పట్టణంలో చోటుచేసుకుంది. టైలర్‌ పని చేసి జీవనం సాగించే రఫిక్‌ తన భార్య జూబేదబేగం(38)కు ఇద్దరు పిల్లలు సుహాన(10) , కరీముల్లా(12) పట్టణంలోని నక్కబండలో గల ఇస్లామ్‌నగర్‌లో నివాసం వున్నారు.జుబేదా మాత్రం ప్రైవేటుస్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోంది. ఇలా ఉండగా చాలా కాలం నుండి జూబేదబేగంను భర్త రఫిక్ ఆమె పై అనుమానం ఎన్నో వేదింపులకు గురిచేస్తున్నందున ఆమె గత సంవత్సరం పుంగనూరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు రఫిక్‌పై వరకట్న వేదింపులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది.ఈ తరహాలో సోమవారం వారి ఇంటివద్ద రఫిక్‌,తన భార్య జూబేదబేగం తో గొడవలు పడుతూ తారా స్థాయికి చేరడంతో కత్తితో జూబేదబేగంపై రఫిక్‌ దాడి చేశాడు. ఈ దాడిలో జుబేదా భేగం కు చేతులకు, మెడపైన, వెనుకభాగంలో తీవ్రమైన కత్తిపోట్లు తగిలి తీవ్ర రక్తస్రావం జరిగింది. విషయం తెలిసిన జూబేదబేగం సోదరుడు అన్సర్‌ తక్షణమే రఫిక్‌ను నివారించేప్రయత్నం చేసి ఆపస్మారస్థితిలో ఉన్న బాధితురాలిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా తనపై తన భార్య దాడిచేసిందని రఫిక్‌ కూడ రక్తగాయాలతో ప్రభుత్వాసుపత్రిలో చేరాడు.ఎవరుపై ఎవరు దాడి చేశారనే విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.సమాచారం తెలిసిన అర్బన్ సీఐ ప్రసాద్‌బాబు, ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement