Thursday, May 16, 2024

టిడిపి అభ్య‌ర్ధి విజ‌యానికి కృషి చేయండి…. చంద్ర‌బాబు..

శ్రీకాళహస్తి – రాబోవు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ టిడిపి శ్రేణులు కష్టపడాలని మాజీ ముఖ్యమంత్రి శ్రీకాళ‌హ‌స్తి నేత‌ల‌కు, కార్య‌క‌ర్త‌ల‌కు సూచించార‌ని టిడిపి పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ తెలిపారు.. హైద‌రాబాద్ లోని మాజీ సీఎం చంద్రబాబు పార్టీ కార్యాలయంలో నియోజకవర్గస్థాయి టిడిపి కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కార్యకర్తలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో అధికార పార్టీ ఆగడాలు శృతిమించి పోతున్నాయని.ప్రతి కార్యకర్త సైనికులుగా పని చేసి టిడిపి అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని తెలియజేశారు. ఈ స‌మావేశంలో పాల్గొన్న విజయ్ కుమార్ నియోజకవర్గ సమస్యలను చంద్ర‌బాబుకి వివరించారు. అధైర్యపడవద్ద‌న‌రి అండగా టిడిపి పార్టీ ఉంటుంద‌ని బాబు తెలిపార‌న్నారు..అధికార పార్టీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని రాష్ట్ర అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఏర్పేడు టిడిపి మండల అధ్యక్షులు నై నూరు పొన్నారవ్, రెడ్డివారి గురువారెడ్డి, దశరథ ఆచారి, ప్రసాద్ నాయుడు తదితరులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement