Wednesday, May 15, 2024

AP EAPCET 2024 పరీక్షల తేదీల్లో మార్పు

ప్రతి సంవత్సరం అగ్రికల్చర్, ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే AP EAPCET పరీక్షల తేదీలలో మార్పులు జ‌రిగాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈఏపీసెట్ పరీక్షలు వాయిదా పడ్డాయి. అప్‌డేటెడ్‌ షెడ్యూల్ ప్రకారం, మే 13 నుండి 19 వరకు జరగాల్సిన EAPSET పరీక్షలు మే 16 నుండి 22 వరకు వాయిదా పడ్డాయి.

అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 16, 17 తేదీల్లో జరగనుండగా, ఇంజినీరింగ్ పరీక్షలు మే 18 నుంచి మే 22 వరకు నిర్వహించనున్నారు. అలాగే ఏపీ పీజీసెట్ పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. పీజీసెట్ పరీక్ష జూన్ 3 నుంచి 16వ తేదీకి వాయిదా పడింది. ఏపీలోని యూనివర్శిటీల్లో పీహెచ్‌డీ సీట్ల భర్తీకి నిర్వహించే ఆర్‌సెట్‌ కూడా షెడ్యూల్‌ ఖరారు అయింది. మే 2 నుంచి మే 5 వరకు ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి ప్రకటనలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement