Sunday, April 28, 2024

TS | డీసీసీబీ చైర్మన్ పదవికి పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామా..

నిజామాబాద్ (ప్రభ న్యూస్) : ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు మెజారిటీ డైరెక్టర్లు వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి క్యాంపులో ఉండగా.. బలపరీక్షకు ముందుగానే బుధవారం రాత్రి తన పదవికి రాజీనామా సమర్పించారు.

- Advertisement -

ఈ సందర్భంగా పోచారాం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ.. డీసీసీబీ చైర్మన్‌గా అవకాశం కల్పించిన బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ప‌ద‌వులు వస్తుంటాయి, పోతుంటాయి.. నాకు పార్టీ కంటే పదవి గొప్ప‌డేమీకాద‌ని అన్నారు.. పదవుల కోసం పార్టీలు మారడం అనైతికమన్నారు. గత నాలుగు సంవత్సరాలుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవిని విజయవంతంగా నిర్వర్తించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement