Monday, April 29, 2024

ఉమామహేశ్వరి పార్ధివ దేహానికి చంద్రబాబు నివాళి.. కుటుంబానికి ఓదార్పు!

దివంగత నేత, సినీ యాక్టర్​ ఎన్టీఆర్ చిన్న కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి ఇవ్వాల ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. ఆమె సూసైడ్ చేసుకున్నారని కుటుంబ సభ్యులే చెప్పడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఉమామహేశ్వరి పార్థివ దేహాన్ని సందర్శించిన మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు.. మృతదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. లోకేశ్ తదితరులు వారి ఇంటికి వెళ్లి బంధువులను ఓదార్చారు. అయితే ఉమామహేశ్వరి మృతికి కారణం ఆరోగ్య సమస్యలేనని తెలుస్తోంది.

నలుగురు కూతుళ్లు

ఎన్టీఆర్ నలుగురు కుమార్తెల్లో ఉమా మహేశ్వరి చివరికుమార్తె అనే సంగతి తెలిసిందే.పెద్ద కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి కాగా, రెండవ కుమార్తె చంద్రబాబు భార్య భువనేశ్వరి, మూడవ కుమార్తె లోకేశ్వరి. ఇటీవలే ఉమామహేశ్వరి కుమార్తె వివాహం కూడా జరిగింది. పెద్ద కూతురు అమెరికాలో ఉంటోంది. రెండో కూతురు ఇక్కడే ఉంటోంది. ఇక.. అమెరికా నుంచి పెద్ద కూతురు వచ్చిన తర్వాత అంత్యక్రియలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement