Wednesday, May 15, 2024

Breaking: చంద్రబాబు రిమాండ్ గడువు ఈనెల 19వరకు పొడిగింపు

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్ గడువును ఏసీబీ కోర్టు పొడిగించింది. ఈ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌, సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

శుక్రవారం మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు వెల్లడించింది. ఈ రెండు పిటిషన్లపై వాదనలు సుదీర్ఘంగా కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ప్రమోద్‌కుమార్‌ దూబే, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ఏసీబీ కోర్టు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అయితే చంద్రబాబు రిమాండ్ గడువును మరో 14రోజులు పెంచుతూ ఈనెల 19వ తేదీ వరకు పొడిగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement