Sunday, April 28, 2024

Breaking: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా..

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెయిల్, కస్టడీ పిటిషన్లపై విచారణను కోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలను వినేందుకు ఏసీబీ కోర్టు రేపటికి వాయిదా వేసింది.

చంద్రబాబు రిమాండ్ గడువు నేటితో ముగుస్తుండడంతో రిమాండ్ పొడిగింపుపై సీఐడీ ఇప్పటికే మెమో దాఖలు చేసింది. చంద్రబాబు రిమాండ్ పొడిగించాలని సీఐడీ మెమోలో కోరింది. అయితే ఏసీబీ కోర్టు చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లపై వాదనలను రేపటికి వాయిదా వేసింది. రేపు మధ్యాహ్నం ఇరుపక్షాల వాదనలు వింటామని ఏసీబీ కోర్టు జడ్జి తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement