Sunday, April 28, 2024

AP :ఇవాళ పల్నాడులో చంద్రబాబు ప్రజాగళం…

ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ పల్నాడు లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పెదకూరపాడు, సత్తెనపల్లి నియోజకవర్గాల లో పర్యటించనున్నారు చంద్రబాబు.

అనంతరం క్రోసూరు , సత్తెనపల్లి ప్రాంతాల్లో ప్రజా గళం బహిరంగ సభల్లో పాల్గొననున్నారు చంద్రబాబు. ఇక ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు ప్రత్యేక హెలి కాప్టర్లో క్రోసూరు చేరుకోనున్నారు చంద్రబాబు. రాత్రికి సత్తెనపల్లిలో బస చేయనున్నారు చంద్రబాబు. ఇక అటు నంద్యాలలో నేడు మహిళలతో నారా భువనేశ్వరి ముఖాముఖిలో పాల్గొంటారు. ఇలా నారా చంద్రబాబు కుటుంబం మొత్తం ప్రచారంలో మునిగిపోయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement