Sunday, April 28, 2024

AP : రెండోరోజు క‌డ‌ప జిల్లాలో ష‌ర్మిల ఏపీ న్యాయ‌యాత్ర‌

ఇవాళ రెండవ రోజు కడప జిల్లాలో షర్మిల ఏపీ న్యాయ యాత్ర కొనసాగనుంది. పెద్ద దర్గాను సందర్శించి ప్రత్యేక ప్రార్ధనలు చేస్తారు షర్మిల. అనంతరం మసాపేట నుంచి ప్రచారం ప్రారంభం అవుతుంది. దేవుని కడప, బైపాస్, అశోక్ నగర్, అప్సరా వై జంక్షన్ కూడలిలో ప్రచారం చేస్తారు.

మధ్యాహ్నం పార్టీ కార్యాలయానికి చేరుకొని అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకుంటారు. సాయంత్రం కార్నర్ మీటింగ్ ఉంటుంది. ఆ తర్వాత సంధ్య కూడలి, ఐటిఐ, మరియపురం సర్కిలల్లో సభ ఉంటుంది. తదనంతరం చర్చిలో ప్రార్ధనలు…. అక్కడ నుంచి బుల్టప్ కూడలి, వినాయక నగర్ కూడలి, ఆల్మస్ పేట, చిలకలబావి, పొట్టి శ్రీరాములు కూడలి మీదుగా ఏడు రోడ్ల కూడలి వరకూ సాగనుంది షర్మిల బస్సు యాత్ర.. రాత్రి ఏడు రోడ్ల కూడలిలో ప్రసంగించునున్నారు షర్మిల.

Advertisement

తాజా వార్తలు

Advertisement