Wednesday, May 15, 2024

‘బాదుడే బాదుడు’ కార్యక్రమం.. నేడు శ్రీకాకుళంలో చంద్రబాబు నిరసన

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం దళ్లవలసలో నిర్వహించనున్న ‘బాదుడే బాదుడు’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో విశాఖకు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా పొందూరు మండలం దల్లవలస గ్రామం చేరుకుని బాదుడే బాదుడు నిరసన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 9.30 గంటలకు విశాఖ టీడీపీ కార్యాలయానికి చేరుకుని, రాత్రి అక్కడే బసచేస్తారు. కాగా, పార్టీ కేడర్‌ను ఇప్పటి నుంచే ఎన్నికలకు సంసిద్ధం చేసేందుకు, వివిధ ఛార్జీల పెంపు, పన్నుల భారాలతో ప్రజలు పడుతున్న అవస్థలపై పోరాడేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు విస్తృతంగా జిల్లాల్లో పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement