Sunday, May 5, 2024

పిడుగుపాటుకు ఇద్దరు మృతి.. మరొకరికి గాయాలు

పిడుగుపాటుకు ఇద్ద‌రు మృతిచెంద‌గా, మ‌రొక‌రికి గాయాలైన ఘ‌ట‌న తెలంగాణ రాష్ట్రంలోని సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షం కారణంగా ఓ మహిళపై పిడుగు పడి మృతి చెందింది. మరో ఘటనలో.. దుబ్బాక మండలం పద్మశాలిగడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని నర్లేంగడ్డ గ్రామంలో తెల్లవారుజామున 3 గంటలకు రోడ్డుపైన ఉన్న వడ్లు తడవకుండా కవర్ కప్పుతుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో సౌడు పోచయ్య (65) అక్కడికక్కడే మరణించగా, పక్కనే ఉన్న రెడ్డబోయిన కొండయ్య (60) అనే వృద్దుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలైన వ్యక్తిని దుబ్బాక ఆసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement