Sunday, May 19, 2024

AP | చంద్రబాబు చేరికతో ఎన్డీయేకు మరింత బలం: ప్రధాని మోడీ

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేరికతో ఎన్డీయే బలం మరింత బలపడిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ కోసం చంద్రబాబు, పవన్‌లు కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఏపీలో డబుల్ ఇంజన్ ప్రభుత్వం వస్తేనే అభివృద్ధిపథంలో దూసుకెళ్తామన్నారు.

జూన్ 4న వచ్చే ఫలితాల్లో ఎన్డీయే 400 సీట్లు దాటాలని పిలుపునిచ్చారు. డబుల్ ఇంజన్ తోనే మన లక్ష్యాలు నెరవేరుతాయని అన్నారు. పేదల కోసం ఆలోచించేది ఎన్డీయే ప్రభుత్వమే.. రైతుల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోందని అన్నారు. పదేళ్లలో 25 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించారని ప్రధాని మోదీ వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement