Tuesday, May 7, 2024

Big Breaking | విక‌సిత్ భార‌త్‌, విక‌సిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌.. ఇదే మా ల‌క్ష్యం!

విక‌సిత్ భార‌త్‌.. విక‌సిత్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ త‌మ ల‌క్ష్య‌మ‌ని ప్ర‌ధాని మోదీ అన్నారు. నిన్న ఎన్నిక‌ల షెడ్యూలు వ‌చ్చింద‌ని.. జూన్ 4న ఫ‌లితాలు వెలువ‌డ‌బోతున్నాయ‌న్నారు. అయితే.. 4వ తేదీ ఫ‌లితాల్లో ఎన్‌డీఏకు 400 మార్కు దాటుతుంద‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. మీ ఉత్సాహం చూస్తుంటే ఇప్పుడు మ‌రోసారి అధికారంలోకి వ‌చ్చినంత సంబురంగా ఉంద‌న్నారు.

ఇక‌.. కోట‌ప్ప‌కొండ స్వామివారి సాక్షిగా విష్ణు, ఈశ్వ‌ర‌, బ్ర‌హ్మ త్రిమూర్త‌ల ఆశీర్వాదం ల‌భించింద‌న్నారు. నాలుగు వంద‌లు దాటాలి.. ఎన్‌డీఏకు ఓటు వేయాల‌ని మోదీ తెలుగులో మాట్లాడి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. కాగా, చిలక‌లూరిపేట బొప్పూడిలో తెలుగుదేశం-జనసేన్-బీజేపీ కూటమి ఆధ్వర్యంలో ఆదివారం జరుగిన ‘ప్రజాగళం’సభలో ఉత్సాహంగా ప్ర‌సంగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement