Wednesday, May 8, 2024

చంద్ర‌బాబు కు నో బెయిల్ – రాజ‌మండ్రికి త‌ర‌లించే అవ‌కాశం

విజయవాడ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో ఆయన తరఫు న్యాయవాదులు ఇదే కోర్టులో దాఖ‌లు చేసిన బెయిల్‌ పిటిషన్ న్యాయ‌స్థానం తిర‌స్క‌రించింది.. దీంతో ఆయ‌న‌ను రాజ‌మండ్రి జిల్లా జైలుకు త‌ర‌లించే అవ‌కాశాలున్నాయి.. కాగా, రేపు హైకోర్టులో బెయిల్ కోసం లంచ‌మోష‌న్ వేయ‌నున్న‌ట్లు చంద్ర‌బాబునాయుడు న్యాయ‌వాదులు తెలిపారు..

ఇది ఇలా ఉంటే స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కాంలో అరెస్టయిన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కి ఎసిబి కోర్టు లో షాక్ త‌గిలింది.. ఆయ‌న‌కు 14 రోజులు రిమాండ్ విధిస్తూ తీర్పు ఇచ్చింది.. ..కాగా శ‌నివారం తెల్ల‌వారుఝామున చంద్ర‌బాబును అరెస్ట్ చేసిన సీఐడీ అధికారులు విజయవాడ నేడు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు .సీఐడీ తరఫున ఏఏజీ సుధాకర్‌రెడ్డి, చంద్రబాబు తరపున లాయర్‌ సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఇరువాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి తుదితీర్పు వెలువ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement