Tuesday, May 14, 2024

Chandra babu Arrest – ఢిల్లీకి బయలుదేరిన నారా లోకేష్ … రేపు జాతీయ మీడియా ప్రెస్ మీట్

రాజమండ్రి – టిడిపి అధినేత చంద్రబాబునాయుడి అరెస్ట్ అక్రమం అనే విషయంపై జాతీయ స్థాయిలో మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వాలని.. ఏపీలో ఉన్న పరిస్థితులను వివరించాలని నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. శుక్రవారం ఢిల్లీలో వెళ్లి ఈ అంశంపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నేప‌థ్యంలోనే టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఎంపీ రామ్మోహన్‌ నాయుడుతో కలిసి రాజమహేంద్రవరం నుంచి ఆయన ఢిల్లీకి వెళ్లారు.

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో రాష్ట్ర పరిస్థితులను జాతీయ స్థాయిలో లోకేశ్‌ వివరించనున్నారు. అలాగే చంద్రబాబు కేసు విషయమై సుప్రీంకోర్టు న్యాయవాదులతో చర్చించనున్నారు. రాష్ట్ర పరిస్థితులు, కక్ష రాజకీయాలపై పార్లమెంట్‌లోనూ చర్చించేలా తెదేపా వ్యూహం రచించినట్లు తెలుస్తోంది. దీనిపై పార్టీ ఎంపీలతో లోకేశ్‌ మాట్లాడనున్నారు. ఈ నెల 18 నుంచి పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే.

కాగా, చంద్రబాబు అరెస్ట్ విషయంలో జాతీయ స్థాయిలో స్పందన వచ్చింది. చంద్రబాబును రాజకీయకక్షోనే అరెస్టు చేశారని అనేక పార్టీల నేతలు ప్రకటించారు. జాతీయ మీడియా కూడా ఈ ఘటనపై విస్తృతంగా కవరేజీ ఇస్తోంది. దీంతో చంద్రబాబు వెనుక జ‌రిగిన కుట్ర‌ మొత్తం ప్రజెంటేషన్ ఇవ్వాలని నారా లోకేష్ భావిస్తున్నారు.

ఏపీ పరిస్థితులపై జాతీయ మీడియాకు ప్రజెంటేషన్
ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవలి కాలంలో దాడులు చేసిన వారిని వదిలేసి బాధితులపైనే కేసులు పెడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నాయి. నాలుగేళ్ల కాలంలో ఏపీలో జరిగినన్ని అరాచకాలు దేశంలో ఎక్కడా జరిగి ఉండవని.. వాటన్నింటినీ మీడియాకు వివరించాలని అనుకుంటున్నారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టకపోవడం అంగళ్లు, పుంగనూరులో చంద్రబాబు ర్యాలీపై రాళ్ల దాడులు చేసి . తిరిగి చంద్రబాబుపైనే హత్యాయత్నం కేసులు నమోదు చేయడం వంటి వాటిని.. లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పిన పరిస్థితుల్ని జాతీయస్థాయిలో హైలెట్ చేయాలని లోకేష్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

- Advertisement -

అదే సమయంలో ఆధారాలు లేని కేసుల్ని ప్రతిపక్ష నేతలపై ఎలా మోపుతున్నారో కూడా వివరించనున్నట్లుగా చెబుతున్నారు. వ్యాపార సంస్థలపై ప్రభుత్వం జరిపినదాడులు.. మార్గదర్శి వంటి సంస్థలు.. అమరరాజా వంటి దేశానికి ప్రాముఖ్యత తెచ్చిన సంస్థలపై జరిగిన దాడుల గురించీ వివరించి.. అరాచక పాలన గురించి వివరిస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. వ్యవస్థల్ని పూర్తి స్థాయిలో నాశనం చేసి న వైనాన్ని వివరించే అవకాశాలు ఉన్నాయి. 73 ఏళ్ల వయసులో ఉన్నచంద్రబాబును పధ్నాలుగేళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసినా ఎఫ్ఐఆర్‌లో కూడా పేరు లేకుండా… గవర్నర్ అనుమతి లేకుండా.. కనీసం నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేసిన వైనాన్ని జాతీయ స్థాయిలో చర్చకు పెట్టే అవకాశం ఉంది.

హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసే అవకాశం

కుదిరితే హోంమంత్రి అమిత్ షాను కూడా కలుస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశంపై స్పష్టత లేదు. అక్క‌డ ప‌రిస్థితుల‌ను బ‌ట్టి అమిత్ షాను కలిసే అవ‌కాశాలున్నాయ‌ని టిడిపి వ‌ర్గాలు అంటున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement