Thursday, May 2, 2024

Breaking | రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు.. బాలిక మెడలో బంగారు గొలుసు చోరీ

తాడిపత్రి టౌన్ (ప్రభన్యూస్): అనంతపురం జిల్లాలో చైన్​ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ట్యూషన్​ నుంచి వస్తున్న ఓ విద్యార్థి నుంచి బంగారు చైన్​ కొట్టేసిన ఘటన అనంతపురంలో ఇవ్వాల (సోమవారం) రాత్రి జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో పట్టణంలోని మన్విత అనే విద్యార్థిని ట్యూషన్​కు వెళ్లి వస్తుండగా ఆమె మెడలో ఉన్న గొలుసును చాకచక్యంగా కొట్టేశాడో దొంగ. కాగా, మన్విత ఆరో తరగతి చదువుతోంది, స్కూల్ తర్వాత సాయంత్రం 6గంటల నుండి 8వరకు జయనగర్ లో ఉన్న కోచింగ్ సెంటర్​కు వెళుతుంది.

ఈ క్రమంలో రాత్రి 8:30 సమయంలో ట్యూషన్ నుండి ఇంటికి వస్తుండగా సైకిల్ పంచరయ్యింది. అయితే.. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటించి, పాప మీ నాన్న చెప్పాడు.. నీ మెడలో గొలుసు తీసుకొని బ్యాగులో పెట్టుకో అంటూ మాయమాటలు చెప్పాడు. ఆ మాటలతో భయపడ్డ విద్యార్థిని మెడలోని బంగారు గొలుసు తీసుకొని స్కూల్ బ్యాగులో వేసి జిప్పు పెట్టింది. మళ్లీ ఒకసారి చూసుకో అమ్మ ఉందో లేదో అని చెప్పడంతో చెక్​ చేస్తుండగానే అతను బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. దీంతో ఆ బాలిక భయంతో ట్యూషన్ సెంటర్​కు వెళ్లి విషయం తెలియజేసింది. ఈ విషయంలో పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందని బాలిక తల్లిదండ్రులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement