Tuesday, May 14, 2024

బీఏఎఫ్‌టీఏ ఇండియా అంబాసీడర్‌గా గునీత్‌ మోంగా కపూర్‌

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌): ది బ్రిటిష్‌ అకాడమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ -టె-లివిజన్‌ ఆర్ట్స్‌(బీఏఎఫ్‌టీఏ) ఇండియా.. 2023 సంవత్సరానికి గాను బ్రాండ్‌ అంబాసీడర్‌గా ప్రఖ్యాత చిత్ర నిర్మాత గునీత్‌ మోంగా కపూర్‌ను ప్రకటించింది. ఇప్పుడు మూడో ఎడిషన్‌లో బీఏఎఫ్‌టీఏ బ్రేక్‌ త్రూ ప్రోగ్రామ్‌కు నెట్‌ ప్లిక్స్‌ అండగా నిలిచింది. ఈ కార్యక్రమం భారతీయ చలనచిత్రం, గేమ్స్‌, టెలివిజన్‌ పరిశ్రమల్లో నెక్ట్స్​ జనరేషన్​లోని ప్రతిభను గుర్తించడం, వారికి సపోర్టుగా నిలవడం, నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా సాగుతోంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ వ్యవస్థాపకురాలు, సీఈవొ గునీత్‌ మోంగా కపూర్‌ మాట్లాడుతూ దేశంలోని సృజనాత్మక పరిశ్రమల్లో అభివృద్ధి చెందుతున్న ప్రతిభావంతుల ప్రొఫైల్‌ను పెంచడంలో సహాయపడటానికి ఏఆర్‌.రెహమాన్‌ అడుగుజాడల్లో ఈ ప్రచారకర్త పాత్రను చేపట్టడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. బీఏఎఫ్‌టీఏ(లెర్నింగ్‌, ఇన్‌క్లూజన్‌) పాలసీ మెంబర్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ టిమ్‌ హంటర్‌ మాట్లాడుతూ ఈ సంవత్సరం బ్రేక్‌ త్రూ ఇండియా ప్రచారకర్తగా గునీత్‌ను స్వాగతిస్తున్నందుకు సంతోషిస్తున్నామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement