Tuesday, May 14, 2024

శ్రీకాకుళం చేనేత క్లస్టర్లకు కేంద్ర ఆర్థిక సాయం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లాలోని రెండు చేనేత క్లస్టర్లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం మంజూరు చేసినట్లు టెక్స్‌టైల్స్‌ శాఖ సహాయ మంత్రి దర్షన జర్దోషి తెలిపారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలోని రెండు చేనేత క్లస్టర్లకు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిన ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం వాటికి ఆర్థిక సహాయాన్ని మంజూరు చేసినట్లు వెల్లడించారు.

అయితే అదే జిల్లాలోని పొందూరు క్లస్టర్‌కు ఆర్థిక సహాయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన అందలేదని మంత్రి తెలిపారు. అలాగే పొందూరు ఖాదీకి ప్రస్తతానికి జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) టాగ్‌ లేదని చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపిందని కూడా మంత్రి చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement