Sunday, April 28, 2024

విదేశీ క‌రెన్సీని బ్యాంకుల‌లో డిపాజిట్ చేసుకోండి – తిరుమ‌ల‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్..

తిరుమ‌ల – విదేశీ కరెన్సీ వ్యవహారంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి కేంద్రం నుండి భారీ ఊరట లభించింది. విదేశీ దాతలు , భక్తులు సమర్పించే కరెన్సీని డిపాజిట్ చేసుకోవడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి టీటీడీకి మినహాయింపును ఇచ్చింది. వీటిని భక్తులు సమర్పించిన కానుకలుగా పేర్కొనాలని కేంద్రం సూచించింది. తద్వారా విదేశీ కరెన్సీ సమర్పించిన భక్తులు, దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడానికి కేవలం టీటీడీకి మాత్రమే మినహాయింపును ఇచ్చింది. సెక్షన్ 50 ప్రకారం ఈ మినహాయింపు లభించింది. ఈ మేరకు టీటీడీ ఈవోకు సమాచారం ఇచ్చింది కేంద్రం. దీంతో హుండీ ద్వారా ల‌భించిన వివిధ దేశాల విదేశీ క‌రెన్సీ నోట్ల‌ను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునే వెసులుబాటు టిటిడికి ల‌భించింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement