Friday, April 26, 2024

దుర్గ గుడిలో సోదాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించిన ఏసీబీ

ఇటీవల విజయవాడ కనకదుర్గ ఆలయంలో ఏసీబీ అధికారులు వరుసగా కొన్నిరోజుల పాటు సోదాలు జరిపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ సోదాలపై నివేదికను ఏసీబీ వర్గాలు రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాయి. దేవాదాయ కమిషనర్ ఆదేశాలను ఈవో బేఖాతరు చేసినట్టు స్పష్టం చేశారు. ప్రీ ఆడిట్ అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా ఈవో చెల్లింపులు చేశారని వెల్లడించారు. టెండర్లు, కొటేషన్లు, సామగ్రి కొనుగోళ్ల కోసం ఈవో చెల్లింపులు జరిపినట్టు వివరించారు. ఈ చెల్లింపులు డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ జనరల్ మార్గదర్శకాలకు విరుద్ధమని ఏసీబీ నివేదికలో పేర్కొన్నారు. టెండర్లను నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్ కు కట్టబెట్టారని తెలిపారు. టెండర్ల కేటాయింపుల్లో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నిబంధనలు పాటించలేదని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ వరకు జరిపిన సోదాల వివరాలను ఆ నివేదికలో పొందుపరిచారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement