Friday, May 17, 2024

AP: గుడిసెలోకి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

శ్రీ సత్యసాయి బ్యూరో, నవంబర్ 25 (ప్రభ న్యూస్) : ఓ కారు గుడిసెల్లోకి దూసుకెళ్లడంతో ఒకరు మృతిచెందిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం అగళి మండల పరిధిలోని పి బ్యాడిగెర గ్రామాన్ని ఆనుకుని ఉన్న కర్ణాటక బార్డర్ కేంతర్ల హట్టి వద్ద చోటుచేసుకుంది.

హైవే నుంచి వస్తున్న కారు కెన్దార్ల హట్టి వద్ద ఒక గుడిసె లోపలికి దూసుకెళ్లింది. దీంతో గుడిసెలోపల నిద్రిస్తున్న మురళి(20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. గుడిసెలో నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా కారు గుడిసెలోకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం నుంచి తండ్రి చంద్రప్ప, శ్రీ రంగప్ప బయటపడినట్లు స్థానికులు తెలిపారు. అగళి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement