Saturday, April 27, 2024

AP : బ‌స్సు బోల్తా…40మంది గాయాలు

ప‌ల్నాడు జిల్లాలో రోడ్డు ప్ర‌మాదం చోటుచేసుకుంది. పుట్టు వెంట్రుకల మొక్కు తీర్చుకునేందుకు కోటప్పకొండకు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం అద్దంకి మండలం తిమ్మాయపాలెం వద్ద చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా తాళ్లూరు మండలం బొద్దికూరపాడు, దర్శి మండలం కొర్లమడుగు గ్రామాలకు చెందిన సుమారు 60 మంది కోటప్పకొండకు ఓ స్కూలు బస్సులో వెళ్తున్నారు. బస్సు కట్టర్‌ విరిగిపోవడంతో తిమ్మాయపాలెంలోని ఆంజనేయస్వామి విగ్రహం సమీపంలో రోడ్డుపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 40 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు ప్రైవేటు వాహనాల్లో అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని 108 వాహనాల్లో ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. బాధితులను ఒంగోలు తరలించేందుకు అద్దంకి సీఐ సి.కృష్ణయ్య, ఎస్సై నాగరాజు, పోలీసులు సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement