Sunday, May 12, 2024

రైల్వే గేటును ఢీకొన్న బొలెరో.. గంటకు పైగా నిలిచిన వాహనాలు..

ఇచ్ఛాపురం, (ప్రభన్యూస్): రత్తకన్న వెళ్లే మార్గంలో రైల్వే లెవెల్ క్రాసింగ్ గేట్ ను ఓ వ్యాను ఢీ కొట్టింది. దీంతో గంటకు పైగా వాహనాలు నిలిచిపోయి జనం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో రైలు వస్తుందని గేట్ మేన్ గేట్ వేశారు. ఈలోగా కొళిగాం నుండి వేగంగా వస్తున్న ఓ బొలెరో వాహనం బలంగా ఢీకొనడంతో గేటు విరిగిపోయింది. దీంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి వెంటనే సమాచారం అందుకొని అక్కడి చేరుకున్న రైల్వే సిబ్బంది రైలు వెళ్లిపోయిన అనంతరం గేటు ఎత్తి పట్టుకోవడం తో కొన్ని వాహనాలు ముందుకు కదిలాయి. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చాలా జరిగినప్పటికీ పాలకులు ప్రత్యామ్నాయం చూపకపోవడం ప్రజల పాలిట శాపంగా మారింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement