Monday, April 29, 2024

Peeleru: బోగస్ ఓట్లు టీడీపీ పుణ్యమే : ఎంపీ మిథున్ రెడ్డి

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : గతంలో తాము బలంగా ఉన్నచోట్ల బోగస్ ఓట్లు చేర్పించిన తెలుగుదేశం పార్టీ వారు ఇప్పుడు వాటినే దొంగ ఓట్లు అంటూ విష ప్రచారం చేస్తున్నారని రాజంపేట లోక్ సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్నారు. ఈరోజు పీలేరులో అయన విలేకరులతో మాట్లాడుతూ…. చాలా చోట్ల అసలైన ఓట్లను తొలగించి దొంగ ఓట్లు సిద్దం చేసిన ఘనత టీడీపీ వారిదేనని ఆరోపించారు.

కుప్పంలో కూడా అనేక దొంగ ఓట్లు ఉన్నట్టు ఆధారాలు ఉన్నయంటూ.. అక్కడ గతంలో కొంత మేరకు దొంగ ఓట్లను తొలగించామన్నారు. ఇప్పుడు కొత్తగా బోగస్ ఓట్లు అంటూ తెలుగుదేశం విష ప్రచారం చేస్తోందంటూ, ఆ ఓట్లు ఎవరి హయాంలో ఎప్పుడు నమోదయ్యాయో రికార్డ్ ఉందన్నారు. బోగస్ ఓట్లు అంటూ తెలుగుదేశం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉందన్నారు. దొంగ ఓట్లు తొలగించాలని మేమే ఎలక్షన్ కమిషన్ ను కోరుతున్నామని మిథున్ రెడ్డి అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement