Tuesday, April 30, 2024

AP | అవుకు రిజ‌ర్వాయ‌ర్‌లో పడవ బోల్తా.. ముగ్గురు మృతి

ఏపీలోని క‌ర్నూలు జిల్లాలో విషాదం నెల‌కొంది. ఆవుకు రిజర్వాయర్లో పడవ బోల్తా పడిన ఘటనలో ముగ్గురు చ‌నిపోయారు. ఈ ఘటన ఇవ్వాల (ఆదివారం) జ‌రిగింది. అవుకు పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రసూల్ కుటుంబం ఆదివారం సరదాగా బోటింగ్ షికారుకు వచ్చారు. మర బోటు పడవలో కుటుంబ సభ్యులంతా కలిసి షికారు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా బోటు బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న కుటుంబ సభ్యుల్లో షేక్ ఆశాబి (18), సాజిత (21), నూర్జహాన్ నీటిలో మునిగి చ‌నిపోయారు. వీరి మృత దేహాలను స్థానికులు వెలికి తీశారు. చనిపోయిన వారిలో నూర్జాన్ నంద్యాలలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement