Monday, May 20, 2024

ఆంజనేయ స్వామికి మొక్కు చెలించిన‌.. మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు

చిట్యాల, ప్రభ న్యూస్ : మండలం వెలిమినేడు గ్రామంలో వెలిసిన మహిమాన్విత శ్రీ భక్తఆంజనేయ స్వామి దేవాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దంపతులు మొక్కుబడులు చెల్లించుకున్నారు.ఈ మేరకు ఆదివారం ఆలయంలో జరిగిన హనుమజ్జయంతి ఉత్సవాలలో బాగంగా మంత్రి జగదీష్ రెడ్డి సతీమణి సునీతా జగదీష్ రెడ్డి,తనయుడు వేమన్ రెడ్డి లు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయ స్వామి అమితంగా ఇష్టపడే 108 వెండి తమలపాకుల ఆకృతితో ప్రత్యేకంగా తయారు చేయించిన తోరణాల మాలలను మంత్రి జగదీష్ రెడ్డి దంపతులు ఆంజనేయ స్వామికి సమర్పించారు. శాస్త్ర యుక్తంగా పూజలు నిర్వహించిన మీదట భక్తఆంజనేయ స్వామికి మొక్కులు చెలించుకున్న మంత్రి జగదీష్ రెడ్డి దంపతులకు అంతకు ముందు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement