Sunday, April 28, 2024

AP BJP: అధికార పార్టీ దొంగ ఓట్ల దందా…సిబిఐ విచార‌ణ‌కు బిజెపి డిమాండ్

వైనాట్ 175 అంటే దొంగ ఓట్ల దందానేనా? జగన్మోహన్ రెడ్డి అంటూ ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్‌ రెడ్డి. తిరుపతిలో నేడు మీడియాతో మాట్లాడుతూ, 20 మంది అధికారులు, 60 మందికి పైగా సిబ్బందితో అధికార‌పార్టీ దొంగ ఓట్లు రాకెట్ నిర్వహిస్తున్న‌దని ఆరోపించారు. దొంగ ఓట్లు దందాపై సిబిఐ విచారణకు సిద్ధమా? అని సవాల్‌ చేశారు.

నేను ఉన్నాను, నేను విన్నాను.. అంటే దొంగ ఓట్లు ఉన్నాయి, మళ్లీ గెలుస్తా అంటే అసలు కిటుకు ఇదా జగన్మోహన్ రెడ్డి? అని ఎద్దేవా చేశారు. తక్ష‌ణం న‌మోదైన , దొంగ ఓట్లును రద్దు చేయాలని ఎన్నిక‌ల సంఘాన్ని కోరారు.. ఏ ప్రింటింగ్ ప్రెస్ లో ప్రింట్ చేశారో బహిర్గతం చేయాలన్న ఆయన ప్రింటింగ్ ప్రెస్ పై చర్యలకు డిమాండ్ చేశారు. అసలైన దోషులను వదలి కాంట్రాక్టు, కంప్యూటర్ ఆపరేట్లపై కేసు పెట్టడం సబబా? అని ప్రశ్నించారు. దొంగ ఓట్ల‌పై ఎంపీ గురుమూర్తికి చిత్తశుద్ధి ఉంటే ప‌ద‌వికి రాజీనామా చేయాలి అని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement