Sunday, April 28, 2024

MLA Rakshana Nidhi: రెండు రోజుల్లో టీడీపీలో చేరడంపై క్లారిటీ..!

ఏపీలో అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎమ్మెల్యే రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు.. తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నాల్గో జాబితాలో తిరువూరు ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసును నియమించారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ…. గత‌ 6 నెలలుగా త‌నకు సీటు రాకుండా కుట్రలు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని నాని.. వైసీపీలోకి వచ్చే ముందే తిరువూరు సీటు కండీషన్‌ పెట్టారని.. అందుకే త‌న‌ను తప్పించడానికి రకరకాల సర్వేలు చేయించి చివరికి సీటు లేకుండా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన త‌నకు మంత్రి పదవి ఇస్తామని రాత్రి 12 గంటలకు చెప్పి.. పదవి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు రక్షణ నిధి.. మంత్రి పదవి ఇవ్వకపోయినా.. పార్టీకి నిబద్ధతతో పని చేశానన్నారు. అయినా.. తనకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అన్యాయం చేసిందన్నారు. ఇక, పార్టీకి రాజీనామా చేసే అంశంపై క్యాడర్‌తో మాట్లాడి ప్రకటిస్తానన్నారు. మరోవైపు.. రెండు రోజుల్లో టీడీపీలో చేరే విషయంపై క్లారిటీ ఇస్తాను అని వెల్లడించారు తిరువూరు ఎమ్మెల్యే రక్షణ నిధి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement