Sunday, April 28, 2024

బైక్‎ను ఢీకొన్న కారు.. కలెక్టర్ దిగ్భ్రాంతి

కృష్ణాజిల్లా గూడూరు మండలం తరకటూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాక్టివా బైక్ ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మచిలీపట్నం జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతి చెందిన వ్యక్తి మచిలీపట్నానికి చెందిన అబ్దుల్ గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ప్రమాద సమయంలో అటుగా వెళ్తున్న జిల్లా కలెక్టర్ జె నివాస్ ఘటనా స్థలాన్ని పరిశీలించి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement