Sunday, April 28, 2024

రెండు బైక్ లు ఢీ – ఇద్దరు యువకులు దుర్మరణం

శ్రీకాకుళం, ఆగష్టు 13(ప్రభ న్యూస్):ఆదివారం పేట జంక్షన్ అయ్యప్ప స్వామి ఆలయం ఎదురుగా వద్ద రెండు బైక్ లు ఎదురుగా వస్తూ ఢీకొన్నాయి.
ఈ ప్రమాదంలో ఆమదాలవలసకు చెందిన మండా జగన్ శర్మ (27), ఆమదాలవలస కే చెందిన మరో యువకుడు సత్యన్నారాయణ (సత్తెయ్య) (25)మృతి చెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

.వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని 108 వాహనంలో రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.ఈ యువకులు బలగ ప్రాంతానికి చెందిన వారిగా తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement