Monday, April 29, 2024

నష్టాల బాటలో చాట్‌జీపీటీ.. 2024 నాటికి దివాలా!

చాట్‌ జీపీటీ వేదిక ఓపెన్‌ఏఐ అతి త్వరలోనే ఆర్థిక సంక్షోభంలోకి జారుకోనుంది. 2024 చివరి కల్లా ఆ కంపెనీ దివాలా తీయొచ్చని అనలిటిక్స్‌ ఇండియా మేగజిన్‌ ఓ నివేదిక వెల్లడించింది. ఈ ఓపెన్‌ఏఐ సంస్థను సామ్‌ ఆల్ట్‌మన్‌ స్థాపించారు. జీపీటీ -3.5, జీపీటీ-4 వాడుకొనేందుకు డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ కంపెనీ సరిపడినంత ఆదాయం ఆర్జించడం లేదు. కనుచూపు మేరలో బ్రేక్‌ ఈవెన్‌ రావడం కష్టమేనని నిపుణులు అంటున్నారు. ఓపెన్‌ ఏఐని నడిపించేందుకు ప్రతి రోజూ 7 లక్షల డాలర్లు (రూ.5.8 కోట్లు) ఖర్చవుతోందని తెలుస్తోంది. ప్రస్తుతానికి డబ్బులు ఖర్చవ్వడమే కానీ లాభాలు గడించే పరిస్థితి లేదని ఆ నివేధిక ద్వారా తెలుస్తోంది.

గతేడాది నవంబర్లో చాట్‌ జీపీటీ మొదలైంది. మొదట్లో యూజర్‌ ఎంగేజ్‌మెంట్‌ అత్యధికంగా ఉండేది. అయితే క్రమంగా వీరి సంఖ్య తగ్గుముఖం పడుతోంది. జూన్‌లో 170 కోట్ల యూజర్లు చాట్‌ జీపీటీని వాడగా జులై నాటికి వీరి సంఖ్య 150 కోట్లకు తగ్గింది. అంటే 12 శాతం పడిపోయింది. చాట్‌ జీపీటీ అభివృద్ధి చేసినప్పటి నుంచి కంపెనీకి 540 మిలియన్‌ డాలర్ల నష్టం వచ్చింది. మే నెలలో ఇవి రెట్టింపు అయ్యాయి. మైక్రోసాఫ్ట్‌ పెట్టిన 10 బిలియన్‌ డాలర్ల పెట్టుబడితోనే ప్రస్తుతం నెట్టుకొస్తోంది. అయితే 2023 చివరికి తమకు 200 మిలియన్‌ డాలర్ల ఆదాయం వస్తుందని ఓపెన్‌ ఏఐ అంచనా వేస్తోంది. 2024కు బిలియన్‌ డాలర్‌ కంపెనీగా అవతరిస్తామని ధీమాగా ఉంది. ఇంతగా నష్టాలు వస్తున్నప్పుడు అదెలా సాధ్యమవుతుందో చూడాలి!!

Advertisement

తాజా వార్తలు

Advertisement