Sunday, May 19, 2024

AP: శిల్పారామంలో ట్రిబ్యూట్ వాల్ కు భూమి పూజ 

తిరుపతి (రాయలసీమ ప్రభ న్యూస్ బ్యూరో) : గాంధీ జయంతి సందర్బంగా ఈరోజు తిరుపతి శిల్పారామంలో స్వాతంత్ర్య సమరయోధుల స్మారకంగా నివాళి గోడ (ట్రిబ్యూట్ వాల్)  నిర్మించేందుకు భూమిపూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్పీకర్ తమ్మినేని సీతారామ్, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్ కె రోజా నిర్వహించారు. ముఖ్యంగా ఈ “ట్రిబ్యూట్ వాల్” ద్వారా స్వాతంత్య్ర పోరాటంలో తమ జీవితాలను త్యాగంచేసిన సమరయోధుల గురించి వారు చేసిన పోరాటాలు గురించి భావితరాలకు తెలిసే విధంగా వారి చిత్రంతో పాటుగా ఏర్పాటు చేసే క్యూఆర్ కోడ్ ద్వారా వారి వివరాలు తెలిసే విధంగా ఏర్పాటు చేయనున్నారు. 

ఈ వాల్ నిర్మించేందుకు ముందుకొచ్చిన చక్రా ఫౌండేషన్ వారికి వక్తలు ధన్యవాదాలు  తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పుదుచ్చేరి స్పీకర్ సెల్వన్, పర్యాటక శాఖా మంత్రి రోజా, రాష్ట్ర శిల్పారామం ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ కల్చరల్ సొసైటీ సి ఈ ఓ శ్యామ్ సుందర్ రెడ్డి తో కలిసి భూమి పూజ నిర్వహించి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, చిత్తూరు ఎంపీ రెడ్డెప్ప, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణా రెడ్డి, తిరుపతి నగర మేయర్ శిరీషా, తదితరులు కూడా పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement