Tuesday, April 30, 2024

భోగాపురం ఎయిర్ పోర్టు శంకుస్థాప‌న‌కు ముహూర్తం ఫిక్స్..

భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు కు మే 3న శంకుస్థాపన జ‌రుగ‌నుంద‌ని రాష్ట్ర‌ మంత్రి గుడివాడ అమర్ నాథ్ వెల్లడించారు. ఆయ‌న మాట్లాడుతూ… ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన శంకుస్థాపనకు నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలిపారు. 2,200 ఎకరాల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం జ‌రుగుతుంద‌న్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల్ వల్లవన్, ఎమ్మల్యే బడ్డుకొండ అప్పల నాయుడు తో కలసి మంత్రి ఏర్పాట్లను పరిశీలించారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి జీఎంఆర్ సంస్థ పనులు ప్రారంభించి 24 నుంచి 30 నెలల్లో నిర్మాణం పనులు పూర్తి చేసిన‌ట్లు మంత్రి గుడివాడ అమర్ నాథ్ తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement